సంస్ధాన్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

సంస్ధాన్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

బాబు జగ్జీవన్ రామ్ అందరికీ ఆదర్శప్రాయుడని మైనారిటీ సంఘ రాష్ట్ర నాయకుడు ఎండి రహీమ్ షరీఫ్ అన్నారు.

ముద్ర, సంస్ధాన్ నారాయణపురం: సంస్ధాన్ నారాయణపురం మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మైనారిటీ సంఘ రాష్ట్ర నాయకుడు ఎండి రహీమ్ షరీఫ్,అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామానికి నిత్యం సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సన్మానించి స్వీట్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిదన్నారు. 

స్వతంత్ర సమరయోధుడిగా, ఉప ప్రధానిగా, దేశ సేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని పేదల,శ్రామికుల సామాన్యుల, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక, సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. అదేవిధంగా భారతదేశంలోని షెడ్యూల్ కులాల అణగారిన వర్గాల హక్కులతో పాటు అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం బాబు జగ్జీవన్ రామ్ అని తెలిపారు. సమావేశం అనంతరం అందుబాటులో లేని పారిశుధ్య కార్మికుల ఇండ్లలోకి వెళ్లి వారి కుటుంబ సభ్యుల మధ్యలో ఆ‌ కార్మికులకు శాలువాలతో సన్మానించి, స్వీట్లు పంపిణీ చేసారు.