రేవంత్ రెడ్డిని కలిసిన గ్రేటర్ మేయర్
ముద్ర,హైదరాబాద్:- గ్రేటర్ హైదరాబాద్ మేయర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్దికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం సీఎంతో సమావేశమైన ఆమె పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అయితే ఇటీవల వరుసగా బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. కానీ దీని వెనుక రాజకీయం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం ట్రాప్లో పడవద్దని ఎవరికీ చెప్పకుండా కలవొద్దని ఇటీవల ప్రతిపక్ష నేతగా సమవేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ కార్యకర్తలందరికీ చెప్పారు. పబ్లిక్ మీటింగుల్లో మాత్రమే కలిసి వినతి పత్రాలివ్వాలని సూచించారు.