‘ర్యాంబో’ రీమేక్లో
క్రేజీ బ్యూటీ హాలీవుడ్ భారీ యాక్షన్ చిత్రం ‘ర్యాంబో’ గురించి తెలియనివారుండరు. ఈ చిత్రాన్ని పునర్నిర్మాణంపై చాలా కాలంగా చర్చ సాగుతోంది. సిల్వస్టర్ స్టాలోన్ నటించిన సంచలన చిత్రం ఇండియా వెర్షన్ లో టైగర్ ష్రాఫ్ నటిస్తారని కథనాలొచ్చాయి. ఆరు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ పై పని జరుగుతోంది.
నిజానికి ఈ యాక్షన్- ప్యాక్డ్ సినిమా ప్రీ లుక్ 2017లో ఆవిష్కరించినా కానీ.. రకరకాల కారణాలతో చిత్రీకరణ ఆలసమైంది. ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్తో పాటు జాన్వీ కపూర్ నటించనుందని కథనాలొస్తున్నాయి. ఒక సోర్స్ వివరాల ప్రకారం.. రాంబో రీమేక్ షూటింగ్ జనవరి 2024లో ప్రారంభం కానుంది.