బీజేపీ వస్తుంది.. అభివృద్ధి చేస్తుంది..

బీజేపీ వస్తుంది.. అభివృద్ధి చేస్తుంది..
  • ఇంటింటి ప్రచారంలో కీర్తిరెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అభివృద్ధి చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని టేకుమట్లమండలం పెద్దంపల్లి, పంగిడిపల్లి, వెలిశాల గ్రామాల్లో గురువారం బీజేపీ మండల అధ్యక్షులు దేశెట్టి గోపాల్ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ మీ ఆడబిడ్డగా ఆశీర్వదించి, కమలం పువ్వు గుర్తుకు మీ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే భూపాలపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.