జోనల్ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్యే గాంధీ

జోనల్ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్యే గాంధీ

కూకట్ పల్లి, ముద్ర :::  కూకట్ పల్లి జోనల్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అభిలాష అభినవ్ ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యే గాంధీతో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో కి వచ్చే  నాలుగు డివిజన్ల కార్పొరేటర్లు 
మాధవరం రోజాదేవి రంగరావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, 
నార్నె శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు లు జోనల్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ,హైదర్ నగర్, కూకట్ పల్లి (పార్ట్) డివిజన్ల లో నెలకొన్న పలు సమస్యలను, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై జోనల్ కమిషనర్ తో  చర్చించామన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ది పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

గతంలో అభివృద్ధి పనులకు డివిజన్ల వారిగా నెలకు 8 కోట్ల రూపాయలు విడుదల అయ్యేవని ,ఇప్పుడు 4 కోట్లు మాత్రమే మంజూరు అవుతున్నాయని  అవి కూడా సకాలంలో రాలేకపోతున్నాయని తెలియజేశామన్నారు. సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడలని, అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని తెలిపామన్నారు. చెరువుల  సుందరికరణ, పార్క్ లు అభివృద్ధి చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, అభివృద్ధి విషయంలో అధికారులతో చర్చించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు ఏర్పాటు కు కృషి చేయాలని జోనల్ కమిషనర్ కు తెలియజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ త్వరితగతిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.