మంచిర్యాల కు చేరుకున్న మల్లిఖార్జున్ ఖర్గే

మంచిర్యాల కు చేరుకున్న మల్లిఖార్జున్ ఖర్గే

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల :  జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు   మల్లిఖార్జున్ ఖర్గే బహిరంగ సభలో పాల్గొనేందుకు మంచిర్యాల కు చేరుకున్నారు. మంచిర్యాల శివారులోని నస్పూర్ లో ఏర్పాటు చేసిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం వచ్చారు. హెలికాప్టర్ లో  మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో హెలిపాడ్ వద్ద 5.40 నిమిషాలకు చేరుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నాయకులు మల్లు రవి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, సంపత్, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మల్లిఖార్జున ఖర్గేకు స్వాగతం పలికారు.