మంత్రి శ్రీధర్ బాబు కు శుభాకాంక్షలు తెలిపిన మంథని మున్సిపల్ నూతన కమిషనర్ మల్లికార్జున స్వామీ

మంత్రి శ్రీధర్ బాబు కు శుభాకాంక్షలు తెలిపిన మంథని మున్సిపల్ నూతన కమిషనర్ మల్లికార్జున స్వామీ

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: మంథని మున్సిపల్ నూతన కమిషనర్ గా నియమితు లయిన జి.మల్లికార్జున స్వామి సోమవారం ఉదయం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను మర్యాద పూర్వకంగా మంథని నివాసంలో కలిసి పుష్ప గుచ్ఛం ఇచ్చి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి  నూతన కమిషనర్ కు పలు సూచనలు చేస్తూ మంథని మున్సిపాలిటీని నిర్భయంగా, అవినీతి రహితంగా తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలని, ఎవరి బెదిరింపులకు లొంగకుండా పని చేయాలని, అభివృద్ధి పరంగా అన్ని రంగాల్లో మంథని పట్టణాన్ని తీర్చిదిద్దుతామని మంత్రి కమిషనర్ కు తెలిపారు.