ఘనంగా వైయస్సార్ వర్ధంతి

ఘనంగా వైయస్సార్ వర్ధంతి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వైయస్ఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఏకకాలంలో రుణ మాఫీ చేసి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత వైయస్సార్ దే అన్నారు, విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్ మెంట్ చేసిన ఘనత వైయస్ఆర్ దే అని అన్నారు.

వారి ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త కంకణ బద్దులమై పని చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గుండాటి శ్రీనివాస్ రెడ్డి,దన్న సింగ్,పోరండ్ల రమేష్,దండి రవీందర్, షబానా మహమ్మద్,ఊరడి లత,ముల్కల కవిత,అన్నే జ్యోతి,ఎగ్గడి శారద,ముక్క భాస్కర్,నెల్లి నరేష్,కంకణాల అనిల్ కుమార్,షేక్ శేహెన్ష,ఆంజనేయులు,మహమ్మద్ భారీ, బషీర్,ఉప్పరీ అజయ్, మామిడి సత్యనారాయణ రెడ్డి,ముల్కల యొన,తమ్మడి ఎజ్రా,హనీఫ్,ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.