అవినీతి,ఆరోపణల్లో వాస్తవం లేదు...
![అవినీతి,ఆరోపణల్లో వాస్తవం లేదు...](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64f3121b59d85.jpg)
ముద్ర, హుజురాబాద్: మండలంలోని కాట్రపల్లి గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై, అవినీతి జరిగిందని వస్తున్న వార్తలలో వాస్తవం లేదని సర్పంచ్ కాసగోని నిరోషా కిరణ్ స్పష్టం చేశారు. శనివారం గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ గ్రామ ఎంపీటీసీ ఫిర్యాదు చేస్తే... విచారణకు డివిజనల్ పంచాయతీ అధికారి రాగ ఫిర్యాదు చేసిన ఎంపిటిసి గైర్హాజరయ్యారన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి రాకపోతే కారణం ఏమిటని ప్రశ్నించారు. విచారణకు వచ్చిన అధికారికి పూర్తి వివరాలు తెలియజేశామని పేర్కొన్నారు. పనిగట్టుకుని డివిజనల్ పంచాయతీ అధికారి సర్పంచ్ కు అండగా ఉండారంటూ తప్పుడు వార్తలు సృష్టించడం సబాబు కాదన్నారు. గ్రామ అభివృద్ధి చేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.