కెసిఆర్ ఉన్నంతకాలం సంక్షేమానికి డోకా లేదు

కెసిఆర్ ఉన్నంతకాలం సంక్షేమానికి డోకా లేదు

నాణ్యతలో కాంప్రమైజ్ కావద్దు
వేగంగా పనులు పూర్తి చేయండి
 మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం 40 డివిజన్   డిమార్ట్ వద్ద 25 లక్షల ఎంజిఎఫ్ నిధులతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను నగర మేయర్ సునీల్ రావు, బారసా నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, కార్పొరేటర్ భూమా గౌడ్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ  అభివృద్ధి పనులన్నీ  త్వరితగతిన పనులను చేపట్టి నాణ్యతతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ అభివృద్ధికి సీఎం కేసీఆర్  వేల కోట్ల నిధులు కేటాయించారని గుర్తు చేశారు. కేసీఆర్‌ పేదల పక్షపాతి అని  కేసీఆర్‌ సీఎంగా ఉన్నంతకాలం సంక్షేమానికి ఢోకాలేదని అన్నారు. బీసీ బంధు,గృహ లక్ష్మీ పథకాలు నిరంతర ప్రక్రియ అని అన్నారు.