ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడాలి

ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడాలి

శంకరపట్నం ముద్ర జూలై 30 :ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు కనకం కుమారస్వామి పిలుపునిచ్చారు.  శంకరపట్నం మండల కేంద్రంలోని బస్టాండ్ లో ఆదివారం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆగస్టు 20న హైదరాబాదులోని ఇంద్ర పార్క్ వద్ద జరగబోయే సదస్సును విజయవంతం చేయాలనిఆయన పిలుపునిచ్చారు.తెలంగాణ కోసం పోరాడిన వారిని స్వతంత్ర సమరయోధులుగా గుర్తించి పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన కోరారు.తెలంగాణ కోసం పోరాడిన వారిపై అక్రమ కేసులు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు.పోలీస్ కేసులను ఉద్యమకారులపై ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి కూడా  ప్రజలు అరిగోస పడుతున్నారని ఆయన విమర్శించారు.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బూర్ల మొగిలి,చెరుకు వెంకటేశం,గోపి మల్లేశం, కన్నబోయిన తిరుపతి, రంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.