తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష

ముద్ర, జమ్మికుంట: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గం జర్నలిస్టులు తమ హక్కుల సాధన కోసం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందని, తమ హక్కుల సాధన కోసం వీలే నిరాహార దీక్షకు పూనుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ హక్కులకు, సాధనకు తగిన హామీ ఇచ్చేవరకు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని అన్నారు