ఆర్మీ జవానుకు స్వాగతం పలికిన గ్రామస్థులు

ఆర్మీ జవానుకు స్వాగతం పలికిన గ్రామస్థులు

ముద్ర, వీణవంక: మండలంలోని బ్రహ్మపల్లి గ్రామానికి చెందిన గాజుల ఓదెలు-మధునమ్మ ల రెండో కొడుకు ఇండియన్ ఆర్మీ లో  పదవీ విరమణ పొంది నేడు అతని  సొంత గ్రామానికి రాగా వారి మిత్రులు కుటుంబ సభ్యులు ఘనంగా శాసలువాలతో సత్కరించి స్వాగతం పలికారు. వివరాల ప్రకారం ఓదెలు-మధునమ్మ లది సాధారణ కుటుంబం, వారికి ముగ్గురు సంతానంలో ఇద్దరు కొడుకులు,ఒక కుమార్తె. రెండో  కొడుకు గాజుల సమ్మయ్య ఇంటర్మీడియట్ పూర్తి చేసి అనంతరం ఆర్మీ రిక్రూట్ మెంట్ లో ఉద్యోగం పొంది ,గత ఇరవై సంవత్సరాలుగా  దేశ సరిహద్దు పహారా కాస్తూ భారత  సరిహద్దు సైన్యంలో సేవలు అందించిన సైనికుడు నేడు పదవీ విరమణ పొంది, తన గ్రామానికి వచ్చిన నేపథ్యంలో ఆయన అభిమానులు, స్నేహితులు,యువకులు వీణ వంక నుండి బ్రహ్మాణపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు.