రోడ్డు ప్రమాదం ఒకరి మృతి

రోడ్డు ప్రమాదం ఒకరి మృతి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: తిమ్మాపూర్ మండల కేంద్రంలోని స్టేజి వద్ద గురువారం ఉదయం హైదరాబాద్ వైపు నుంచి కరీంనగర్ వస్తున్న కారు అతివేగంతో రోడ్డు దాటుతున్న స్కూటీని ఢీకొనడంతో తిమ్మాపూర్ కు చెందిన అట్ల పోచమల్లు యాదవ్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. కారు వేగంతో ఎదురుగా ఉన్న రెండు కరెంట్ స్తంభాలను సైతం ఢీకొట్టి నిలిచిపోయింది. మృతుడి స్కూటీ నుజ్జునుజ్జయింది. మృతుడు స్థానికుడు కావడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై ప్రమోద్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.