ప్రోటోకాల్ ఉల్లంఘించి అవమానిస్తున్నరు
- బీజేపీ ప్రజా గర్భంలో సునామీ
- సమయం వచ్చినప్పుడు ప్రళయం సృష్టిస్తుంది
- బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్
ముద్ర కరీంనగర్ ప్రతినిధి: ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారని కలెక్టర్ కు స్థానిక మంత్రికి ఫోన్ చేసిన స్పందించలేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం చొప్పదండి నియోజకవర్గంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు కనీస సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహించడం నీచ సంస్కృతికి నిదర్శనం అన్నారు.
నన్ను అవమానిస్తే సమయం వచ్చినప్పుడు 100 రేట్లు అనుభవించాల్సి వస్తుందని పేర్కొన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం శాశ్వతం సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు జాగ్రత్త అని మండిపడ్డారు. బిజెపి ప్రజాగర్భంలో సునామిలా ఉందని, సమయం వచ్చినప్పుడు ఓటుతో ప్రళయం సృష్టిస్తుందని హెచ్చరించారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కట్టిన బిల్డింగులకు తిరిగి శంకుస్థాపన చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. పిల్లలు చదువుకుంటున్న స్కూలును పున ప్రారంభించడం వారి అజ్ఞానానికి మచ్చుతునక అన్నారు.