ఎమ్మెల్యే అడ్లూరికి రోడ్డు ప్రమాదం
- అపోలో హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్న వైద్యులు
- మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలింపు
- ఆందోళనలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు
ముద్ర ప్రతినిధి కరీంనగర్ : ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురి అయింది. సెక్యూరిటీ తో పాటు ఆయన సిబ్బంది హుటాహుటిన అపోలో హాస్పిటల్ కు తరలించారు. పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యే తో పాటు వాహనంలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్దఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఘటన జరిగినట్లు సమాచారం. దీంతో ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తీవ్ర ఆందోళనకు. గురవుతున్నారు మరింత సమాచారం తెలియాల్సి ఉంది.