మోడీ వాట్సాప్ ఛాన‌ల్‌కు 50 ల‌క్షల మంది ఫాలోవ‌ర్లు 

మోడీ వాట్సాప్ ఛాన‌ల్‌కు 50 ల‌క్షల మంది ఫాలోవ‌ర్లు 

న్యూఢిల్లీ: ప్రధాని  మోడీ వాట్సాప్ ఛాన‌ల్ రికార్డు క్రియేట్ చేసింది.  కేవ‌లం వారం రోజుల్లోనే ప్రధాని  మోడీని  వాట్సాప్ ఛాన‌ల్‌లో 50 ల‌క్షల మంది ఫాలో అయ్యారు. ఈ నేప‌థ్యంలో వాట్సాప్ యూజ‌ర్లకు  ఆయ‌న థ్యాంక్స్ తెలిపారు.   ప్రపంచ దేశాల నేత‌ల్లో   మోదీ వాట్సాప్ ఛాన‌ల్‌ను చాలా మంది ఫాలో అవుతున్నారు. చాలా వేగంగా, అత్యధిక  సంఖ్యలో  ఫాలోవ‌ర్లు ఉన్నారు.  యువ‌త ఇస్తున్న సపోర్టును ఆహ్వానిస్తున్నాన‌ని, ఈ వేదిక ద్వారా విభిన్న అంశాల‌పై క‌నెక్ట్ అవుదామని ఆయ‌న అన్నారు. మోదీ వాట్సాప్ ఛాన‌ల్‌ను లాంచ్ చేసిన తొలి రోజే సుమారు ప‌ది ల‌క్షల మంది దాంట్లో చేరారు.