ముఖేశ్అంబానీ భూరి విరాళం
- భారీగా హాజరైన సినీ తారలు
అయోధ్య : రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రముఖ వ్యాపార వేత్త ముఖేశ్అంబానీ భూరి విరాళాన్ని అందజేశారు. అంబానీ కుటుంబ సభ్యులంతా కలిసి రూ.2.51 కోట్లను రామ మందిరం ట్రస్టుకు అందించారు.
అలాగే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా హాజరైన సినీతారలు.. అతిరథ మహారథులు జై శ్రీరామ్అంటూ నినాదాలు చేశారు. వారిలో నటులు అబితాబ్బచ్చన్, రజనీకాంత్, మెగాస్టార్చిరంజీవి, పవన్కళ్యాన్, రామ్చరణ్, రణ్బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, అభిషేక్బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ హిరానీ, మాధురీ దీక్షిత్ తదితరులు ఉన్నారు.