నా భార్య నుంచి నాకు ప్రాణహాని

నా భార్య నుంచి నాకు ప్రాణహాని

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నరేష్ ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కానీ తన పర్సనల్‌ లైఫ్‌ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కుంటున్నారు. ఆయన మూడో భార్య Ramya Raghupathi రమ్య రఘుపతి వ్యవహారంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. తాజాగా నటుడు నరేష్ తనకు ప్రాణహాని ఉందని కోర్టును ఆశ్రయించారు. తనను చంపడానికి రమ్య రఘుపతి ప్రయత్నిస్తోందని నరేష్ ఆరోపించారు. సుపారీ ఇచ్చి హత్య చేయించాలని రమ్య ప్రయత్నిస్తోందని నరేష్ అంటున్నారు. రమ్య రఘుపతి బెంగళూరుకు చెందిన రాకేష్ శెట్టి అనే వ్యక్తితో తనను అంతం చేయించడానికి ఒప్పందం కుదుర్చుకుందని నరేష్ వాదిస్తున్నారు. ఈ మేరకు నరేష్ కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టారు. తన ఇంటి గేటు ఎదుట కొందరు తిరుగుతున్నారని, వారు రెక్కీ చేస్తున్నారని ఆరోపిస్తూ వీడియో ఫుటేజీలను కూడా విడుదల చేశారు.

ఏపీ మాజీ పీసీసీ చీఫ్, ఉమ్మడి ఏపీలో మాజీ మంత్రి అయిన రఘువీరా రెడ్డితో ఫోన్ చేయించి బెదిరింపులకు కూడా పాల్పడ్డారని నరేష్‌ వాపోతున్నారు. తన పర్సనల్‌ ఫోన్ హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వాపోయారు. రమ్య వేధింపులను తట్టుకోలేకపోతున్నానని, తన నుంచి విడాకులు ఇప్పించాలని నరేష్ కోర్టును కోరారు. తన మీద ప్రేమతో తనను వివాహం చేసుకోలేదని. కేవలం తన ఆస్తిమీద మోజుతోనే తనను వివాహం చేసుకుందని ఆయన ఆరోపిస్తున్నారు.  సుపారీ గ్యాంగ్ ను మాట్లాడుకుని నన్ను చంపాలనుకుంది.

2022 ఏప్రిల్ లో కొంతమంది అగంతకులు నా ఇంట్లో చొరబడ్డారు. 24 లక్షలు రికవరీ చేయడానికి వచ్చామని మాయ మాటలు చెప్పారు. ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని అన్నారు. తనకు నేను డబ్బులు ఇవ్వకపోవడంతో పలు రకాలుగా చంపాలని చూసింది. కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డి తో ఫోన్ చేయించి బెదిరించింది. నన్ను చంపేస్తారని భయంతో ఎక్కడికి ఒంటరిగా వెళ్ళటం లేదు. అంతేకాక తను ఫోన్‌ హ్యాకింగ్‌ కూడా నేర్చుకుందని అన్నారు. నా ఫోన్ ను హ్యాక్ చేసి పర్సనల్ మెసేజ్‌లు కూడా చూసేదని అన్నారు.