కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ  ఏటీఎం ప్రారంభం 

కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ  ఏటీఎం ప్రారంభం 

ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరి పట్టణంలోని యాదాద్రి కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రధమ ఏటీఎం నెహ్రూ నగర్ లో సొసైటీ చైర్మన్ శ్రీ పోల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ ఎగ్జిక్యూటివ్ సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గుణకొండ రాంబాబు మాట్లాడుతూ భువనగిరి పట్టణంలో ప్రజల సౌకర్యం కోసం  బీబీనగర్, భువనగిరి పట్టణ ప్రాంతాలలో ప్రస్తుతం మూడు ఏటీఎంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ గోల్కొండ సంజీవరావు, డైరెక్టర్లు పోచంశెట్టి రవీందర్, దూసర చంద్రశేఖర్, బచ్చు శ్రీనివాస్, బచ్చు నరేందర్, కరుణాకర్ పాల్గొన్నారు.