పేట వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్ బిఆర్ఎస్ లో చేరిక

పేట వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్ బిఆర్ఎస్ లో చేరిక
  • కండువా కప్పిన ఎమ్మెల్యే పద్మ

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ నియోజకవర్గం చిన్నశంకరంపేట మండల పరిషత్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరగా కండువా  కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.  కాంగ్రెస్ పార్టీని గత పది సంవత్సరాలుగా కష్టపడుతూ క్యాడర్ ను కాపాడుకుంటే కష్టపడిన కార్యకర్తలకు కాకుండా పారాషూట్ నాయకులకు డబ్బులకు టికెట్లు అమ్ముకొని టికెట్ ఇచ్చారని సత్యనారాయణ గౌడ్ ఆరోపించారు. కష్టపడ్డ కార్యకర్తలకు విలువ లేకుండా పోయిందని మనస్థాపంతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో నికార్సైన కార్యకర్త ఎవరు లేరు అంతా రాజీనామాలు చేస్తు  బయటకు వస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని పిలుపునిచ్చారు. మండల సోషల్ మీడియా కన్వీనర్ నవీన్, మండల కార్యకర్తలు పార్టీలో చేరారు.