నేడు నాంపల్లి కోర్టులో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ

నేడు నాంపల్లి కోర్టులో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ

ముద్ర,తెలంగాణ:- తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌రావు బెయిల్‌ పిటిషన్లపై నాంపల్లి కోర్టు తీర్పు ప్రకటించనుంది. నిందితుల బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో ఇప్పటికే వాదనలు ముగిశాయి. అయితే.. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును పోలీసులు కోరిన నేపథ్యంలో.. నాంపల్లి కోర్టు ఎలాంటి తీర్పును ఇవ్వబోతోందోనన్న ఉత్కంఠ నెలకొంది.