రామచంద్రయ్య మరణం రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు.....

రామచంద్రయ్య మరణం రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు.....
  • రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రామచంద్రయ్య సంతాప సభ..

ఆలేరు (ముద్ర న్యూస్):అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి దేశెట్టి రామచంద్రయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించడం రైతుకూలీ ఉద్యమాలకు తీరని లోటు అని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడాల బిక్షపతి. జిల్లా అధ్యక్షులు కళ్లెపు అడివయ్యలు అన్నారు. సోమవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ఏ డెమోక్రసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రామచంద్రయ్య సంతాప సభకు వారు ముఖ్య అతిథులుగా హాజరై రామచంద్రయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామచంద్రయ్య నిరంతరం ప్రజలను ఐక్యం చేస్తూ రైతు కూలీ పోరాటాలను నిర్వహించే వారిని గుర్తు చేశారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు. రైతు కూలీ సంఘానికి తీరని లోటు అని చెప్పారు. ఆయన చూపిన మార్గంలో రైతు కూలీ సంఘం నాయకులు ముందుకు సాగుతూ ప్రజా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇక్కిరి సహదేవ్. గడ్డం నాగరాజు. పంగ రవి. శిఖలం కుమారస్వామి. ఇక్కిరి బీరయ్య. ఇక్కిరి శ్రీనివాస్. ఎలగందుల సిద్ధులు తో పాటు తదితరులు పాల్గొన్నారు.