రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రమేష్ రెడ్డి

రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రమేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తన చిన్ననాటి మిత్రుడు అయిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సోమవారం హైదరాబాదులో కలిసి శుభాకాంక్షలు తెలిపామని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అందుకు తీవ్రంగా టిపిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి వ్యవహరించి అన్ని తానే నడిపి పార్టీని గెలుపు దిశగా పయనింపజేయడంలో సక్సెస్ అయ్యారని ఆయన అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలను ప్రజలు ఎండగట్టారని, కెసిఆర్ అవినీతిని ప్రజలకు వివరించడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ప్రమాణ స్వీకారం జరిగిన అనంతరం మొదటి కేబినెట్ మీటింగ్ లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తూ సంతకం చేయడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన తెలంగాణ ప్రజలకు రమేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తనకు సుపరిచితురాలు, మంత్రిగా అవకాశం వస్తుందని ప్రచారం జరుగుతున్న ములుగు శాసనసభ్యురాలు అనసూయ అలియాస్ సీతక్కను కలిసి రమేష్ రెడ్డి ఇతర నాయకులు శుభాకాంక్షలు అందజేశారు. ఈ మేరకు సోమవారం ఎల్లా హోటల్లో వారిని కలుసుకున్నట్టు పత్రిలకు పత్రికలకు విడుదల చేసిన పట్టణంలో రమేష్ రెడ్డి పేర్కొన్నారు.