బీసీ  మైనార్టీలను మోసం చేస్తున్న కేసీఆర్

బీసీ  మైనార్టీలను మోసం చేస్తున్న కేసీఆర్

ముద్ర తిరుమలగిరి: బీసీ  మైనార్టీ బందు పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని కాంగ్రెస్ అనుబంధ మైనార్టీ సెల్ తుంగతుర్తి నియోజకవర్గం అధ్యక్షులు ఎండి హాఫిజ్ ఆరోపించారు. సోమవారం నాడాయన తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీసీ మైనార్టీల ఓట్లను ఆకర్షించేందుకే కొత్త కొత్త పథకాలు అమలు చేస్తున్నారని ఆయన అన్నారు బీసీ బందు పేరుతో వివిధ కులాలకు లక్ష రూపాయల రుణం ఇస్తామని చెప్పి నేటి వరకు కూడా ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు లబ్ధిదారులకు రుణాలు ఇవ్వకపోగా మైనార్టీ బందు పేరుతో మరోసారి మోసం చేస్తున్నారని ఈ మోసాన్ని ప్రజలు గమనించి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు  దళిత బంధు పేరుతో దళితకు పది లక్షలు ఇచ్చిన కేసీఆర్ మైనార్టీలకు లక్ష రూపాయలు ఇవ్వడంలో ఆంతర్యమేమిటి అని ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రజలు కేసీఆర్ మోసాలను గమనించి రానున్న ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు తుంగతుర్తి నియోజకవర్గంలో నేటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కొత్తపెళ్లి ఉపేందర్ గిరిజన సెల్ మండల శాఖ అధ్యక్షులు ప్రేమ్ ప్రసాద్. రామోజీ తదితరులు పాల్గొన్నారు