ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ముద్ర,అనంతగిరి:77వ స్వాతంత్ర దినోత్సవ  సందర్బంగా అనంతగిరి మండల కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో..అధ్యక్షులు ముసుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగినవి, జెండా ఎగురవేసి స్వాతంత్రోద్యమ విశిష్టతను వివరించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ...రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలకుల బానిసత్వం నుంచి బయటపడిన రోజు అని తెలిపారు.ఎందరో సమరయోధుల ప్రాణత్యాగాలు.. పోరాటల ఫలితంగా 1947వ సంవత్సరం, ఆగస్టు 15న మనం ఈ స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాం. ఈ నేపథ్యంలో ఆ మహానుభావులను స్మరిస్తూ.. వారికి మనసారా నివాళులు అర్పిస్తూ.. సగర్వంగా ఈ పంద్రాగస్టు వేడుక జరుపుకుందాం అంటూ. అనంతగిరి మండల ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం లో సీనియర్ నాయకులు అధ్యక్షులు కొండపల్లి వాసు. వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం వెంకటరెడ్డి, వివిధ గ్రామాల ప్రజాపతినిధులు. సర్పంచులు. ఎంపీటీసీలు. గ్రామ శాఖ అధ్యక్షులు. తదితరులు పాల్గొన్నారు