రేపు నర్సాపూర్ కు రేవంత్ రెడ్డి రాక

రేపు నర్సాపూర్ కు రేవంత్ రెడ్డి రాక

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లా నర్సాపూర్ కు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈనెల 20న రానున్నారు.  ఈ సందర్బంగా భారీ బహిరంగ  ఏర్పాటు చేశారు. బహిరంగ సభ జరిగే సభా స్థలిని కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని నేతలకు ఆవుల రాజిరెడ్డి  సూచించారు. ఏర్పాట్లపై స్థానిక నేతలతో చర్చించారు.  సభను విజయవంతం చేసేలా నేతలంతా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. నాయకులు  రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, సోమన్నగారి రవీందర్ రెడ్డి, సుహాసిని రెడ్డి, శేష సాయి రెడ్డి ఉన్నారు.