అనారోగ్యంతో  సర్పంచ్ మృతి

అనారోగ్యంతో  సర్పంచ్ మృతి

ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి జిల్లా పానుగల్ మండల పరిధిలోని రాయినిపల్లి గ్రామ సర్పంచ్ సుఖేందర్ నాయుడు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సుఖేందర్ నాయుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఉండేవాడని, అనారోగ్యం తీవ్రతరం కావడంతో తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. మృతునికి భార్య నీలమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.