సీ అండ్ ఎండి బలరాం నాయక్ రాత్రి రాక
- అర్జీ-1, 2, 3 ఏరియా లో విశ్రుత పర్యటన
- ఉదయం జీడీకే-2 ఇంక్లైన్ లో క్యాంటిన్ లో కార్మికులతో కలిసి టిఫిన్
ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: శనివారం రాత్రి తెల్లవారుజామున 2:45 గంటలకి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సి అండ్ ఎండి బలరాం నాయక్ అర్జీ-1ఏరియా లోని చైర్మన్ బంగ్లా కి వచ్చారు.
వారికి అర్జీ-1 ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ మరియు అర్జీ-1 ఏరియాలోని మైన్స్ అండ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి లు అధికారులు ఘనంగా స్వాగతం పలికినారు.
అనంతరం అర్జీ-2 ఏరియాలోని ఓసీపీ -3 మరియు అర్జీ-1 ఏరియాలోని జీడీకే-2 ఇంక్లైన్ మైన్స్ ను సందర్శించి, కార్మికులతో కలిసి ఆర్జీ-2 మైన్స్ లో క్యాంటీన్ లో ఉదయం టిఫిన్ చేశారు.
ఈ కార్యక్రమంలో అర్జీ-1 ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ అర్జీ రీజియన్ సేఫ్టీ జిఎం సాంబయ్య, అర్జీ-2 ఏరియా జిఎం L V సూర్యనారాయణ, అర్జీ-1 ఏరియా ఇతర అధికారులు పాల్గొన్నారు.