ఈ నెల 13 వరకు అసెంబ్లీ 10న ఓటాన్ అకౌంట్బడ్జెట్
ముద్ర, తెలంగాణ బ్యూరో :రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 13 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ బడ్జెట్సమావేశాలు గురువారం ఉదయం మొదలయ్యాయి. గవర్నర్ తమిళి సౌందర్రాజన్ప్రసంగం తర్వాత అసెంబ్లీని వాయిదా వేశారు. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ సమావేశానికి హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి బలాల, సీపీఐ ఎమ్మేల్యే కూనంనేని సాంబశివ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 13 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 10న బడ్జెట్ ప్రవేశపెట్టి, 11న సెలవు ఇవ్వనున్నారు. ఆ మరుసటి రోజు నుంచి 13 వరకు బడ్జెట్పై చర్చలు, ఇతర అంశాలను కొనసాగించనున్నారు.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 9, 10,12,13 తేదీల్లో నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.