భారత్లో హింస పెరిగింది
- ప్రస్తుతం గాంధీ, గాడ్సేల మధ్య పోరాటం జరుగుతోంది
- ఇండియా కూటమి అంటే బీజేపీకి భయం
- యూరప్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ
బ్రస్సెల్: దేశ ప్రజల వాక్కును బీజేపీ అణిచివేయాలని చూస్తోందని, ప్రస్తుతం ఇండియాలో గాంధీ, గాడ్సేల మధ్య పోరాటం జరుగుతోన్నట్లు పరిస్థితులు ఉన్నాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపించారు. భారత్లో ప్రజాస్వామ్యంపై దాడులు పెచ్చుమీరాయని పేర్కొన్నారు. శుక్రవారం యూరప్ లోని బ్రస్సెల్ప్రెస్క్లబ్లో రాహుల్మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. భారత దేశంలో హింస, వివక్ష పెరిగిందన్నారు. అదే సమయంలో మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు, అట్టడుగువర్గాలపై దాడులు పెచ్చుమీరాయన్నారు.
ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసే కుట్ర..
విపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పర్చుకుంటే ఆ కూటమిని విచ్ఛిన్నం చేసే చర్యలకు బీజేపీ పాల్పడుతోందన్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియా పేరును కాస్త భారత్గా మార్చాలని కుటీల యత్నాలకు తెరతీసిందని దుయ్యబట్టారు. దేశం దృష్టిని అదానీపై నుంచి మళ్లించేందుకే ఇలా చేశారని ఆరోపించారు. భారతదేశంలో పేదలు ఇంకా పేదరికంలోకి వెళుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు, దేశాభివృద్ధిపై నిక్కచ్చిగా మాట్లాడుతుందనే జి–20 సమావేశాలకు కాంగ్రెస్ను పిలవలేదన్నారు. దేశంలోని 60 శాతంమంది ప్రజలకు నాయకత్వం వహిస్తున్నవారికే ప్రాముఖ్యత ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇది బీజేపీ ఆలోచనలకు అద్దం పడుతోందన్నారు. అదే సమయంలో జి–20కి అధ్యక్ష బాధ్యతలు భారత్పొందడం శుభపరిణామంగా అభివర్ణించారు. రష్యా–ఉక్రెయిన్యుద్ధంపై దేశ వైఖరికి తాము మద్దతు తెలుపుతున్నామన్నారు. రష్యాతో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. కాగా గురువారం రాత్రి యూరోపియన్ యూనియన్ ఎంపీలతో రాహుల్గాంధీ భేటీ అయ్యారు.