షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు : కిషన్రెడ్డి
![షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు : కిషన్రెడ్డి](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64a64d4a21ecc.jpg)
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ప్రకారమే జరుగుతాయని బీజేపీ స్టేట్చీఫ్కిషన్రెడ్డి తెలిపారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమిలి ఎన్నికల ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని కొందరు అనుకుంటున్నారని, అలాంటి భ్రమలు పెట్టుకోవద్దని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. కచ్చితంగా షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయన్నారు.