షెడ్యూల్​ ప్రకారమే ఎన్నికలు : కిషన్​రెడ్డి

షెడ్యూల్​ ప్రకారమే ఎన్నికలు : కిషన్​రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్​ప్రకారమే జరుగుతాయని బీజేపీ స్టేట్​చీఫ్​కిషన్​రెడ్డి తెలిపారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమిలి ఎన్నికల ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జి ప్రకాశ్‌ జవదేకర్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని కొందరు అనుకుంటున్నారని, అలాంటి భ్రమలు పెట్టుకోవద్దని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. కచ్చితంగా షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయన్నారు.