వార్డెన్ సస్పెండ్, ఇద్దరు విఓఏల తొలగింపు

వార్డెన్ సస్పెండ్, ఇద్దరు విఓఏల తొలగింపు
  • కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ పాపన్నపేట మండలం  కొత్తపల్లి బిసి  బాలుర హాస్టల్ వార్డెన్ ఎ.మనోహర్ ను   సస్పెండ్ చేసినట్లు  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్   రాజర్షి షా తెలిపారు. వార్డెన్   విధులలో నిర్లక్ష్యం వహించి,   ఎన్నికల ప్రచారంలో  పాల్గొన్నట్లు   ఫిర్యాదు రావడంతో జిల్లా  అధికారి నివేదిక ఆధారంగా  వార్డెన్ ను  సస్పెండ్ చేసినట్లు   జిల్లా కలెక్టర్   రాజర్షి షా  తెలిపారు. అలాగే చేగుంట మండలం చందాయిపేట  గ్రామ విఓఎ ఎ. పద్మను, హవెలి ఘనపూర్ మండలం ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ   ప్రచారాలలో పాల్గొనకూడదని సూచించారు. ఎన్నికల విధులలో నిర్లక్ష్యం  వహిస్తే  సిసిఎ  రూల్, ఎన్నికల నియమావళి ప్రకారం  చర్యలు తీసుకోవలసి వస్తుందని  రాజర్షి షా హెచ్చరించారు.