బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం..

బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం..
  • ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి, రాఘవపురం, రామకిష్టాపురం(వి) గ్రామాల్లో బిజెపి భరోసా యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి పాల్గొని గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30న జరిగే ఎన్నికల్లో 1వ నెంబరు పైన ఉన్న కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నాయకులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.