రాంగ్సైడ్లో కారును ఢీకొన్న బస్సు
- ఆరుగురు మృతి.. ఇద్దరికి గాయాలు
- యూపీ సీఎం సంతాపం
ఘజియాబాద్: ఢిల్లీ–మీరట్ఎక్స్ప్రెస్వే ఘజియాబాద్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. విజయ్చౌక్వద్ద ఓ పాఠశాల బస్సు టీయూవీ–300 అనే కారును అతివేగంగా వస్తూ ఢీకొట్టింది. బలంగా కారును ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు కారులోని వారిని వెలికి తీసేందుకు భారీ కట్టర్లు వాడాల్సి వచ్చింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్సోషల్ మీడియాలో ప్రత్యక్షమయింది. మీరట్కు చెందిన కుటుంబం కారులో రాజస్థాన్లోని ఓ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు వెళుతుండగా రాంగ్సైడ్లో వస్తున్న బస్సు ఢీకొంది. ఈ బస్సు 8 కిలోమీటర్ల దూరం నుండి హైవేపై రాంగ్సైడ్లోనే వస్తోందని పోలీసులు గుర్తించారు. స్కూలు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ట్రాఫిక్ డీసీపీ రామానంద్ తెలిపారు. ప్రమాద సమయంలో పాఠశాల బస్సులో విద్యార్థులు ఎవరూ లేరన్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని డీసీపీ తెలిపారు. కాగా 8 కిలోమీటర్లు ఎక్స్ప్రెస్ హైవేపై రాంగ్సైడ్లో అంతపెద్ద బస్సు వెళుతుండగా పోలీసుల దృష్టికి ఎందుకు రాలేదని దాన్ని ఎందుకు అడ్డుకోలేదని మీడియా ప్రశ్నించగా డీసీపీ నీళ్లు నమిలారు. ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతేగాక గాయపడ్డవారికి మెరుగైన వైద్యచికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.