దుబ్బాకలో  సాయి చందుకు కళాకారుల నివాళులు

దుబ్బాకలో  సాయి చందుకు కళాకారుల నివాళులు

దుబ్బాక,ముద్ర:-ప్రజా ఉద్యమ గాయకుడు సాయి చందు మరణం యావత్ తెలంగాణ కళారంగానికి తీరని లోటని సిద్దిపేట జిల్లా దుబ్బాక కు చెందిన కళాకారులు అన్నారు.  దుబ్బాక సంస్కృతిక సారధి కళాకారులు గురువారం దుబ్బాకలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద సాయి చెందు చిత్ర పటానికి పూలమాలలు వేసి కన్నీటి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారధి  టీం లీడర్ బిట్ల ఎల్లం, చీకోడు నర్సింలు, ఆస రామారావు, తుమ్మల ఎల్లం, జింక దేవదాస్, కాముని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.