అవ్వా.. ఈ మీట నొక్కాలి..
ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి కోసం ఆ పార్టీ శ్రేణులు ముమ్మర ప్రరచారం నిర్వహిస్తున్నాయి. పట్టణంలో 1వ వార్డులో కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్ ఆధ్వర్యంలో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. డమ్మీ ఈవీఎంతో గడపగడపకు వెళ్లి ఓటు ఎలా వేయాలో తెలిజేస్తూ ప్రచారం నిర్వహించారు.
ముఖ్యంగా వృద్ధలకు ‘అవ్వా.. ఈ మీట నొక్కితే.. కారుకు ఓటు పడుతది..’ అంటూ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్ష, కార్యదర్శులు తాళ్లపల్లి సురేష్ బాబు, మోతే ఐలయ్య, వార్డు ఇన్చార్జి రాకేశ్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సేవెల్లి మధు, మాజీ కౌన్సిలర్ కన్నారపు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.