‘పల్లా’ గెలుపు ఎప్పుడో ఖాయమైంది

‘పల్లా’ గెలుపు ఎప్పుడో ఖాయమైంది

జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి

ముద్ర ప్రతినిధ, జనగామ : జనగామ నియోజకవర్గంలో బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైందని జడ్పీ చైర్మన్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి అన్నారు. పల్లా కోసం శనివారం ఆయన పట్టణంలోని 4వ వార్డు కౌన్సిలర్ మంత్రి శ్రీశైలం ఆధ్వర్యంలో అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి, స్టేషన్​ఘన్‌పూర్‌‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్‌‌ ప్రభుత్వం 9 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు విరిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు.

కేసీఆర్‌‌ పెట్టిన సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌‌ను సీఎం చేయాలని పాగాల పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు మధుసూదన్, మాజీ కౌన్సిలర్ జనార్దన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శంకర్ యూత్ అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్, ప్రసాద్ శేఖర్, వంశీ రాజు, శేషారెడ్డి పాల్గొన్నారు.

కోవిడ్‌ సేవా సమితి ఆధ్వర్యంలో...

భాషాకార్ల అలోక్ కోవిడ్ 19 సేవాసమితి అధ్యక్షుడు గండి నాగరాజు ఆధ్వర్యంలో పల్లా కోసం శనివారం ప్రచారం నిర్వహించారు. సేవా సమితి సభ్యులు కోవిడ్ వచ్చి మృతి చెందిన కుటుంబాలను కలిసి తాము చేసిన సేవలను వివరించారు. పల్లా గెలిస్తే మరిన్ని సేవలు అందుతాయని తెలిజేస్తూ ఓట్లు అభ్యర్థించారు. కమిటీ సభ్యులు మహమ్మద్ అక్తర్ పాషా, తుంగ సతీష్, పవన్, కళ్యాణ్, రాకేష్, పండగ నరేష్, దుబ్బాక వీరస్వామి పాల్గొన్నారు.