తూతూ మంత్రంగా మండల సభ

తూతూ మంత్రంగా మండల సభ

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల సర్వసభ్య సమావేశం శనివారం తూతూ మంత్రంగా జరిగింది. మండల సభ్య సమావేశం ఎంపీపీ కందుల రేఖ అధ్యక్షతన జరిగింది. మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశంలో గత సమావేశంలో చేసిన తీర్మానాల అమలు, వచ్చే మూడు నెలల్లో ఆయా శాఖల ద్వారా చేపట్టే పనులను సభలో చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ అందుకు భిన్నంగా కేవలం ఆరోగ్య, వ్యవసాయ, ఎక్సైజ్, నీటి పారుదల శాఖల పనితీరును తూతూ మంత్రంగా సమీక్షించి మిగతా శాఖను వదిలేసి ముగించారు. సర్వసభ్య సమావేశంలో జడ్పిటిసి మారపాక రవి, మండల వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి ఆయా శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.