మాలలందరికీ దళిత బందు ఇవ్వాలి
![మాలలందరికీ దళిత బందు ఇవ్వాలి](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_64636ab4d82cc.jpg)
జఫర్గడ్, ముద్ర: జిల్లాలోని మాలల అందరికీ దళిత బంధు ఇవ్వాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోపోజు రమేష్ బాబు డిమాండ్ చేశారు. జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలో మంగళవారం మాల మహానాడు క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సచివాలయం ముందు ఏర్పాటు చేయడం, సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం అభినందనీయమన్నారు. ఆయన ఆశయ సాధన కోసం జనగామ జిల్లాలో ఉన్న మాల లందరికీ దళిత బంధు పథకాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జాతీయ సలహాదారు కొండ్ర రాజలింగం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి, కొండ్ర నర్సింగం, వెంకటేష్, మల్లయ్య తదితరులు ఉన్నారు.