భారత  ప్రజాస్వామ్య చరిత్రలో నూతన అధ్యాయం

భారత  ప్రజాస్వామ్య చరిత్రలో నూతన అధ్యాయం

భారత  ప్రజాస్వామ్య చరిత్రలో నూతన అధ్యాయం మొదలవబోతోంది. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ భవనాన్ని ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఎన్​డీఏ ప్రభుత్వం ఏర్పటై తొమ్మదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ భవనం ప్రారంభమవుతోంది. 2020 డిసెంబరులో సెంట్రల్​ విస్టాకు ప్రధాని భూమి పూజ చేశారు. ఆ తరువాత రెండున్నరేళ్ళలోపలే కొత్త భవన నిర్మాణం పూర్తయింది. ఈ భవనంలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతాయి.