తిరుమలలో విశ్రాంతి గృహం నిర్మాణానికి భూమిపూజ

తిరుమలలో విశ్రాంతి గృహం నిర్మాణానికి భూమిపూజ

తిరుమల ఆగష్టు 21: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ సెల్ కాన్ ఆధ్వర్యంలో తిరుమలో విశ్రాంతి గృహం నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఈవో ధర్మారెడ్డి తో పాటు సెల్ కాన్ సంస్థ చైర్మన్ వై గురు పాల్గొన్నారు. సెల్ కాన్ సంస్థ దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్నదని తమ సంస్థ ఈ విశ్రాంతి గృహాన్ని సంవత్సరంలోపు నిర్మాణం పూర్తి చేస్తామని సెల్ కాన్ సంస్థ చైర్మన్ వై గురు తెలిపారు.