కళా సేవా పురస్కారానికి ఎంపికైన గుండేటి రాజు

కళా సేవా పురస్కారానికి ఎంపికైన గుండేటి రాజు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త నిర్వహణలో తేదీ. 22 ఆగస్టు మంగళవారం కరీంనగర్ లో ప్రపంచ జానపద కళోత్సవాల సందర్భంగా స్థానిక ఫిలిం భవన్ లో నిర్వహించే కార్యక్రమంలో జగిత్యాల కు చెందిన కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్ అధినేత గుండేటి రాజు మూడు దశాబ్దాలుగా చేస్తున్న కలసేవకు కళా సేవా పురస్కారం 2023  ప్రదానం చేస్తున్నట్లు కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు జి. కృపాదానం తెలిపారు.

ఈ అవార్డ్ పట్ల జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, సీనియర్ పాత్రికేయులు టి.వి.సూర్యం, సిరిసిల్ల శ్రీనివాస్, ఎన్నాం కిషన్ రెడ్డి, ఉపాద్యాయ సంఘాల నాయకులు అలిశెట్టి రాజు, బోనగిరి దేవయ్య, బి. ఆనందరావు, ఒడ్నాల రాజశేఖర్,  కవయిత్రులు మద్దెల సరోజన, కటుకం కవిత, అయిత అనిత తదితరులు హర్షం వెలిబుచ్చారు.