లాస్య పాఠశాలలో గోరింటాకు పండుగ

లాస్య పాఠశాలలో గోరింటాకు పండుగ

ముద్ర, మల్యాల:మల్యాలలోని లాస్య పాఠశాలలో ఆషాడ మాసం పురస్కరించుకొని, గోరింటాకు పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గోరింటాకు పెట్టుకొని సంబురాలు జరుపుకున్నారు. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుందని, అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి, రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుందని ఉపాధ్యాయుల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్  రాజు, ప్రిన్సిపాల్ సుష్మ, తదితరులు పాల్గొన్నారు.