రూ. 21 లక్షలతో సీసీ రోడ్ పనులు ప్రారంభం 

రూ. 21 లక్షలతో సీసీ రోడ్ పనులు ప్రారంభం 

ముద్ర ప్రతినిధి, బోడుప్పల్: బోడుప్పల్ మునిసిపల్ కార్పొరేషన్ 10 వ డివిజన్లో మేయర్ సామల బుచ్చిరెడ్డి మంగళవారం సిమెంట్ కాంక్రీట్ రోడ్ పనులు ప్రారంభించారు. 10 వ డివిజన్లోని వెస్ట్ బాలాజీ హిల్స్ లో 21 లక్షల వ్యయంతో రోడ్ పనులు మంజూరయ్యాయి. ఈ పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు బొమ్మకు సుగుణ బాలయ్య, దొంతరాబోయిన మహేశ్వరి కృపసాగర్ర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.