చైన్ స్నాచర్ కు  దేహశుద్ధి.. పోలీసులకు అప్పగింత

చైన్ స్నాచర్ కు  దేహశుద్ధి.. పోలీసులకు అప్పగింత
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల పట్నంలోని బైపాస్ రోడ్ లో మహిళ మెడలో బంగారు పుస్తెలతాడు దొంగతనానికి పాల్పడిన   దొంగకు స్థానికులు దేహశుద్ధి చేశారు. కృష్ణ నగర్ కు చెందిన రంగా లలితా అనే మహిళ తన స్నేహితులతో కలిసి లో సాయిబాబా గుడిలో జరుగుతున్న పారాయణ ఉత్సవాలకు వెళ్లి తిరిగి వస్తుంది. బైపాస్ రోడ్ లో వస్తుండగా గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి మహిళ మెడలో ఉన్న పుస్తెలతాడును లాక్కొని పారిపోతున్నారు. స్థానికులు నిందితుల వెంబడించగా బైపాస్ రోడ్డు నుంచి శివ సాయి లాడ్జి వరకు దొంగ పరిగెత్తుకుంటూ పారిపోయాయి ప్రయత్నం చేశాడు.

స్థానికులు దొంగలు పట్టుకొని దేహశుద్ధి చేశారు.  పట్టణ సీఐ కిషోర్ కు సమాచారం అందించగా పోలీసులు ఘటన స్థలానికి  చేరుకొని దొంగను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించి విచారిస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దొంగతనానికి పాల్పడిన ఇద్దరు మల్యాల మండలం నూకపల్లిగా పేర్కొన్నారు. చైనీస్ మ్యాచింగ్ పాల్పడిన ఒకరు దొరకగా మరొకరు  పారిపోయారు.