చిన్నంబావిని మండల కేంద్రంగా చేసి అభివృద్ధి చేశా – జూపల్లి కృష్ణారావు

చిన్నంబావిని మండల కేంద్రంగా చేసి అభివృద్ధి చేశా – జూపల్లి కృష్ణారావు

ముద్ర.కొల్లాపూర్: చిన్నంబావిని మండల కేంద్రంగా చేసి గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించానని మాజీ మంత్రి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అన్నారు.చిన్నంబావి మండలం వెల్టూర్,చిన్నమారుర్ గ్రామాల్లో పల్లె పల్లెకు మన జూపల్లి కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు..చిన్నంబావిని మండల కేంద్రంగా చేసి  గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించానని,గ్రామాల్లో సీసీ రోడ్లు,డ్రైనేజీ లు తాగునీటి సౌకర్యం ఇలా అనేక రకాలుగా అభివృద్ది చేశానని జూపల్లి అన్నారు.చిన్నంబావి మండల రైతాంగానికి నీళ్లు లేక పంటలు ఎండిపోతు ఉంటే ఎమ్మెల్యే కు కనీసం పట్టించుకునీ అధికారులతో మాట్లాడే ఓపిక కూడా లేదు అని,ప్రతిపక్షాల నాయకులను అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసే సమయం మాత్రం ఉంది అని విమర్శించారు.ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఎందుకు మీ గ్రామాలకు రావడం లేదని,ఎందుకు సాగునీటి సమస్య మీద మాట్లాడటం లేదని.సమాధానం చెప్పుకునే దమ్ము లేక మొహం తప్పించి తిరుగుతున్న అసమర్థ ఎమ్మెల్యే కొల్లాపూర్ కు అవసరమా అని ప్రజలను ప్రశ్నించారు.తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సోనియమ్మ రుణం తీర్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, నాయకులు కళ్యాణ్ రావు, నారాయణ, బీచ్పల్లి యాదవ్ తదితరులు ఉన్నారు.