తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సిద్దిపేట, ముద్ర ప్రతి నిధి: తెలంగాణ  అవిర్భావ దినోత్సవ  ఉత్సవాల  ఏర్పాట్ల పనులను  జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ పరిశీలించారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జూన్-2 తెలంగాణ  ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మైదానంలో స్టేజి, వేడుకలను గూర్చి తెలిపేలా ప్లేక్సి ఏర్పాటు చెయ్యాలని సూచించారు.

మైదానంలో ఎల్ మాదిరిగా విఐపి కారిడార్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వేడుకలను వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులు అందరికి సరిపడే గాలరీ లను నిర్మించాలని కాంట్రాక్టర్ కి తెలిపారు. అందరికి సరిపడే తాగునీటి వసతి కల్పించాలని స్థానిక తహసిల్దార్ విజయసాగర్ కి తెలిపారు. రంగథాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద చుట్టూ కలర్లు వేసి, పూలతో అందంగా ముస్తాబు చెయ్యాలని మునిసిపల్ కమిషనర్ సంపత్ కుమార్ కు తెలిపారు.మైదానంలో పరేడ్,బందోబస్తు,కార్ పార్కింగ్ లాంటి విషయాలను చూసుకోవాలని పోలిస్ అడిషనల్ డిసిపి అడ్మిన్ మహేందర్ కి తెలిపారు. ఎలాంటి పోరపాట్లు జరగకుండా అందరి సమన్వయంతో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లను చెయ్యాలని అధికారులను ఆదేశించారు.