అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన సందర్భంగా రేపు ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ఇదే ...
ముద్ర,సెంట్రల్ డెస్క్:- జనవరి 22న అయోధ్య లో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు ఈ ప్రత్యేక వేడుకకు హాజరుకానున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి స్వయంగా హోస్ట్గా వ్యవహరించనున్నారు.
రామమందిరం ప్రారంభోత్సవం, శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేళ.. ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్.
ప్రధాని ఉదయం 10:20 గంటలకు కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయానికి చేరుకుంటారు.
ఉదయం 10:45గంటలకు హెలికాప్టర్లో సాకేత్ కళాశాలకు చేరుకుని 10 నిమిషాల తర్వాత రామమందిరానికి చేరుకుంటారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ప్రాణ ప్రతిష్ఠ పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 2 గంటలకు కుబేర్ తిల శివాలయంలో మోదీ పూజలు చేస్తారు.
అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.