పాలమూరులో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం..

పాలమూరులో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం..

మహబూబ్ నగర్, ముద్ర: పాలమూరు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు వసంత మాట్లాడుతూ.. వరంగల్ లో కాంగ్రెస్ నేతలు నిర్వహిస్తున్న హత్ సే హత్ జోడో యాత్రలో  కొంతమంది బీఆర్ఎస్ గుండాలు వరంగల్ కు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్ పై దాడి చేశారని, ఈ దాడిలో పవన్ ముక్కు చెవుల భాగం తలభాగంలో తీవ్రంగా గాయాలయ్యాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ గుండాల దాడినేని నిరసిస్తూ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు జి.మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దాహనం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత, లక్ష్మణ్ యాదవ్. సిరాజ్ కద్రి. సాయి బాభా. చలువుగాని రాఘవేందర్. శ్రీనివాస్ గౌడ్. ఎర్పుల నాగరాజు. రాములుయాదవ్. వెంకటయ్య. పకీర్ అహ్మద్. మల్లేశ్ యాదవ్. సుభాష్ కత్రి. అజ్మత్ అలి. అబ్దుల్ హాక్. వెంకటలక్మి. సీనియర్ కాంగ్రెస్  నాయకులు, గంగిరెడ్డి, తాహేర్, సల్మాన్, శివ గౌడ్, ప్రక్రు, అషు, చంద్రమౌళి, నరేష్ యాదవ్, కురువ నరేష్, రమేష్ నాయక్, ఎనుగొండ మల్లేష్, నరేష్ గౌడ్, రాఘవేందర్, రామకృష్ణ, జగదీష్,  అలి, అన్ను, ఖాజా, మహేష్, గోపాల్,  తదితరులు పాల్గొన్నారు.